Pages

Monday, August 31, 2015

మల్లో మధ్యతరగతి భారతీయులు Posted On Mon 31 Aug 22:40:18.511572 2015

మల్లో మధ్యతరగతి భారతీయులు

Posted On Mon 31 Aug 22:40:18.511572 2015
        మధ్య తరగతి వర్గం చైనా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌ దేశాలలో ఎక్కువగా ఉన్నారు. దీనికి విరుద్ధంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నారు. చైనాలో 2001లో 3 శాతం ఉండగా 2011 నాటికి గణనీయంగా 18 శాతానికి చేరుకున్నారు. అంటే 20 కోట్ల మంది చైనీయులు రోజుకు 10 డాలర్లకు మించి ఆదాయం సంపాదిస్తున్నారు. మధ్యతరగతి వర్గం వారు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 31 శాతం నుంచి 51 శాతానికి పెరిగారు. తూర్పు యూరప్‌లో 2001లో 21 శాతం ఉన్న మధ్యతరగతివారు 2011 నాటికి 53 శాతానికి చేరు కున్నారు. ఇక్కడ మధ్యతరగతి వారు 3.9 కోట్ల మంది అద నంగా వచ్చి చేరారు. దక్షిణ అమెరికా, మెక్సికోలో 6.3 కోట్లకు చేరుకున్నారు. భారతదేశంలోని పేద రికం 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గినా, మధ్యతరగతి కుటుంబీకుల శాతం కేవలం 1 శాతం నుంచి 3 శాతానికి మాత్రమే పెరిగారు. ప్రపంచంలో మధ్యతరగతి వర్గం కేవలం 13 శాతంతో సరిపెట్టుకుంటూ, మనదేశానికి వచ్చేసరికి 3 శాతంతోనూ, ఎక్కువ శాతం జనాభా ఊహల ప్రపంచంలో ఉన్న మధ్యత రగతిగా చెప్పుకోవటం వాస్తవ విరుద్ధం, భ్రమ మాత్రమే అనేది పెవ్‌ పరిశోధనా సంస్థ అధ్యయనం ద్వారా తెలుస్తున్నది.
మన దేశంలో మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని, విద్యావిధానంలో 80 శాతం వరకూ మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వృత్తి విద్యా కోర్సులకు, వొకేషనల్‌ కోర్సులకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ అటు చదువుకున్న ఇంజనీర్లకు పరిశ్రమల్లో ఉద్యోగాలు లేక ఇటు చేతివృత్తులకు, గృహ పరిశ్రమలకు ఆదరణ కరువై భారతదేశ ఉత్పత్తి నైపుణ్యత నానాటికీ మందగిస్తోంది. రానురానూ బ్లూకాలర్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతూ, సర్వీసు రంగానికీ, దళారులకూ ప్రాధాన్యత పెరుగుతూ ఉత్పత్తిచేసిన రైతుకు గిట్టుబాటు ధర దొరకక వ్యవసాయరంగం సంక్షో భంలోకి నెట్టబడుతోంది. విద్యా విధానం పిరమిడ్‌ వలే వృత్తి కోర్సులతో ప్రారంభమై పైకి వెళ్లే కొలదీ తక్కువ శాతంలో ఇంజ నీరింగ్‌ వంటి కోర్సులు ఉండాలి. కాగా మనదేశంలో తిరగ బడిన పిరమిడ్‌ వలే ఉండటం బాధాకరం.
పెవ్‌ పరిశోధనా సంస్థ బృందం నాయకుడు రాకేష్‌ కొచ్చర్‌ ''గ్లోబల్‌ మధ్యతరగతి మనం ఆలోచించే దానికన్నా చిన్నదనీ, ఇది మనం అనుకున్నంత ఐశ్వర్యవంతం కానిదనీ, దీనికి తోడు ప్రపంచంలో ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరి మితమైనదనీ'' అంటున్నారు. ప్రపంచ జనాభాలో 50 డాలర్ల కంటే దినసరి ఆదాయం ఎక్కువగా ఉండి, 7 శాతం ఉన్న అధిక ఆదాయం గల ధనవంతులు యూరప్‌, ఉత్తర అమెరికాల్లో ఉన్నారు. వీరిలో 87 శాతం ఈ దేశాల్లోనే ఉండటం గమనార్హం. విచారించదగ్గ, ఆలోచించదగ్గ విషయం ప్రస్తుతం పెట్టుబ డిదారీ ఆర్థికవ్యవస్థ ''పేదరికం, అల్పాదాయం'' ను 71 శాతం జనాభాకు ఇచ్చిన బహుమతి. ''ఈ పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ అత్యధిక ప్రజానీకానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చ లేదనేది వాస్తవంకాగా, 20 డాలర్లకన్నా తక్కువ ఆదాయం గలవారిని కూడా కలిపితే మొత్తం 84 శాతం జనాభా ఈ అల్పా దాయ జాబితాకు వస్తారు'' అని ఆర్థిక విశ్లేషకుడు అండ్రేడామిన్‌ అంటు న్నారు. ఈ 84 శాతం ప్రజానీకానికి విద్య, వైద్యం భార మై, అధిక ధరలతో, నిరుద్యోగ సమస్యలతో నివాసయోగ్యంలేక సమస్యల వల యంలో చిక్కుకుపో తున్నారు.
1. పేదలు (రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కల్గినవారు) : 161.7 కోట్ల నుంచి 94.9 కోట్లకు తగ్గారు (29 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు)
2. అల్పాదాయం కలవారు (రోజుకు 2 డాలర్లకు ఎక్కువ 10 డాలర్లకు తక్కువ ఆదాయం కలవారు) : 275 కోట్ల నుంచి 344.4 కోట్లకు పెరిగారు. అనగా ప్రపంచ జనాభాలో 50 శాతం నుంచి 56 శాతానికి పెరిగారు. పేదలు, అల్పా దాయం కల్గిన ప్రజలు కలిసి 71 శాతం ఉన్నారు. ప్రపం చపు జనాభాలో సింహభాగం వీరిదే.
3. మధ్య తరగతి ఆదాయం కలవారు (10 డాలర్లకు ఎక్కువ 20 డాలర్లకు తక్కువ) : 39.9 కోట్ల నుంచి 78.4 కోట్లకు పెరిగారు. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వార్షి కాదాయం 14,600 డాలర్ల నుంచి 29,900 డాలర్లు కలవారు.
4. ఉన్నత మధ్యతరగతి ఆదాయం కలవారు. (20 డాలర్లకు ఎక్కువ 50 డాలర్లకు తక్కవ ఆదాయం కలవారు) : 7 శాతం నుంచి 9 శాతానికి పెరిగారు. ఇది 40.8 కోట్ల జనా భా నుంచి 58.4 కోట్లకు పెరిగిన జనాభాతో సమానం.
5. ధనికవర్గం వారు. (రోజుకు 50 డాలర్ల పైబడిన ఆదాయం కలవారు) : వీరు 6 శాతం నుంచి 7 శాతానికి పెరిగారు. ఇది 39.9 కోట్ల నుంచి 42.7 కోట్ల ప్రపంచ జనాభాతో సమానం.
- బుడ్డిగ జమిందార్‌ 
(వ్యాసకర్త ప్రోగ్రెసివ్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

No comments:

Post a Comment